Archive for the 'కథలు' Category

మృతజీవులు-21

మృతజీవులు ఇరవయ్యొకటో భాగాన్ని ప్రచురించాం, చూడండి.

జగదీషూ జ్యోతిలక్ష్మీ

బూదరాజు అశ్విన్ రాసిన కథ జగదీష్-జ్యోతిలక్ష్మి ప్రచురించాం, చదవండి.

హార్ట్ బ్రేకింగ్

పట్రాయని సుధారాణి రచించిన హార్ట్ బ్రేకింగ్ కథను మీకోసం అందిస్తున్నాం.

నేటి రచనలు

మృతజీవులు ఇరవయ్యో భాగం, లలిత రాసిన తెలుగు - పిల్లలు వ్యాసం సమర్పిస్తున్నాం. వీటితో పాటు చిరుప్రాయంలోనే రచనలు చేస్తున్న కొవ్వలి శ్రావ్యవరాళి రాసిన అనువాద కథ, పిల్లీ, కుక్కల మధ్య వైరం ఎలా వచ్చింది?ని కూడా ప్రచురించాం.

కొంగేదీ?

అలతి పదాలతోనే అక్షరాలను దృశ్యాలుగా ఆవిష్కరింపజేసే నేర్పున్న మూలా సుబ్రహ్మణ్యం గారు తనదైన శైలిలో పొద్దు కోసం మొదటిసారిగా పంపిన చిన్న కవితను చదవండి.

దాంతోపాటు కొడవటిగంటి కుటుంబరావు రష్యను భాష నుండి అనువదించిన నవల మృతజీవులు, పందొమ్మిదో భాగాన్ని కూడా ఆస్వాదించండి.

నిశ్శబ్దానికి మరోవైపు

నిశ్శబ్దానికి మరోవైపు కథను ప్రచురించాం. కొల్లూరి సోమశంకర్ రచించిన ఈ కథ గ్రంథాలయ అధికారుల ఉద్యోగ విశేషాలను వివరిస్తుంది.

మిట్టూరోడి సాహితీ సేద్యం

“నువ్వెన్నన్నా అను ప్రబల్ కన్నా! నాకు ముండమోపులంటే బలే యిష్టిం!” అన్నా.

“అవున్లే వాళ్లకైతే మొగుళ్లుండరు. ఇష్టమొచ్చినట్టు ఆడించొచ్చని నీ ప్లాను!” అనింది నన్ను జడతో వొకటి కొట్టి.

********** **********

పై సంభాషణ ఎక్కడిదో చూచాయగా కూడా గుర్తు పట్టలేకపోయారంటే తెలుగు సాహిత్యంలో మీరు ఒక విశిష్టమైన పార్శ్వాన్నింకా రుచి చూడలేదని అనుకోవలసివస్తుంది. అలివేలు మంగమ్మకొక దండం అనే కథలోని మాటలివి. మీరిదివరకే చదివుంటే, ఈనెల పొద్దు కథల విభాగంలో ప్రచురించాం, మళ్లీ చదవచ్చు.

ఈ నెల పుస్తక సమీక్ష విభాగంలో - ఇదే రచయిత వెలువరించిన జీవిత చిత్రణ మునికన్నడి సేద్యం నవల పరిచయాన్ని కూడా అందిస్తున్నాం.

ఎవరు అహంకారి?

భార్యాభర్తలిద్దరూ సంసారరథానికి రెండు చక్రాల్లాంటివారు. ఐతే స్వాతిశయం కొద్దీ రెండో చక్రం ఉనికిని గుర్తించకుండా ఒక్కరే లాగబోతే రథం ఒరిగిపోకుండా నిలుస్తుందా? ఒకరి కళ్ళుగప్పి ఇంకొకరు నడచుకోవడం సమర్థనీయమా? అలాంటి ఇద్దరు దంపతుల కథే వింజమూరి విజయ్ కుమార్ రాసిన అహంకారి. ఇంతకూ ఇద్దరిలో ఎవరు అహంకారి? అతిథి శీర్షికలో ఈ కథను ప్రచురించాం, చదవండి.

శశిశ్రీ కథల సమీక్ష

ప్రచురితమయ్యే ప్రతి పుస్తకమూ సాహిత్యానికో కానుక.
ప్రతి సిరాబొట్టూ కానేరదు వెయ్యి మెదళ్ల కదలిక.
అది పాఠకుల్లో కలిగించే కదలికే దాని విలువకో సూచిక.

“ఉత్తమ సాహిత్యానికి జన్మస్థానం, గమ్యస్థానం కూడా సమాజమే” అని నమ్మే శశిశ్రీ. తొలి కథాసంపుటి దహేజ్. ప్రధానంగా ముస్లిం జీవితాలను చిత్రించిన ఈ సంపుటిపై సమీక్షను, ఆ సంపుటిలోనించి అలికిడి అనే కథను పొద్దులో చదవండి.

తెల్లకాగితం

పెద్దలు పిల్లవాడి గొంతులో, పసి(డి)మనసుతో మాట్లాడ్డం అంత సులువేమీ కాదు. ముళ్ళపూడి వెంకటరమణ దీనికో బెంచిమార్కు పెట్టి ఉంచాడు. కొత్తపాళీ గారు ఈ బెంచిమార్కును పరీక్షిద్దామని అనుకున్నారో ఏమో తెలీదు గానీ పిల్లవాడి స్వగతాన్ని కథగా రాయమని మన కథకులను ఉసిగొలిపారు (స్వగతమే రాయాలని ఏం లేదు గానీ అలా రాస్తే బాగుంటుందని అన్నారు) కొత్తపాళీ వారి పిల్లవాడు మరీ బుడుగంత పసోడేం కాదు.., అయినా పసోడే! వారి పిలుపుకు స్పందనగా మన కథకులు చక్కటి కథలు రాసారు. కొల్లూరి సోమశంకర్ గారి తెల్లకాగితం కూడా ఆ పిలుపుకు స్పందనే. సోమశంకర్ గారి పసోడు పసగల వాడే! చదవండి.